TSICET-2023 Results | తెలంగాణ ఐసెట్ ఫలితాలను వెల్లడయ్యాయి. హనుమకొండ కాకతీయ యూనివర్సిటీలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, టీఎస్ఐసీఈటీ చైర్మన్ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్, కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ వీ వెంకట రమణ, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ఎస్కే మహమూద్, టీఎస్సీహెచ్ఈ సెక్రెటరీ శ్రీనివాసరావు, ఐసెట్ కన్వీనర్ వరలక్ష్మి విడుదల చేశారు. ఐసెట్లో నూకల శరణ్కుమార్ అనే విద్యార్థి మొదటి ర్యాంకు సాధించారు. సాయి నవీన్, రవిజేత వరుసగా రెండు, మూడు ర్యాంకులు సాధించారు. ఎంబీఏ (MBA), ఎంసీఏ(MCA) కోర్సుల్లో ప్రవేశానికి మే 26, 27 తేదీల్లో తెలంగాణలో 16, ఏపీలోని నాలుగు కేంద్రాల్లో పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. 70,900 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.