TS Weather Update | రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉపరితల ద్రోణి ఈశాన్య మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, మరాఠ్వాడల మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతోందని పేర్కొంది. దీని ప్రభావంతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, పలు చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అక్కడక్కడ ఈదురుగాలులతో వర్షం పడే అవకాశాలున్నాయని పేర్కొంది.