TS Weather | తెలంగాణలో రాగల మూడురోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో శుక్రవారం ఏర్పడిన అల్పపీడనంగా బలపడిందని, ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతుందని పేర్కొంది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉందని తెలిపింది. వీటి కారణంగా రాగల మూడురోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది.