TS Weather Report | రాష్ట్రంలో మరో రెండు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం నుంచి శుక్రవారం వరకు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, వడగళ్లతో వర్షం కురిసే అవకాశం ఉంది పేర్కొంది.
ఈ మేరకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఇదిలా ఉండగా.. ఇవాళ ఉదయం 8.30 గంటల వరకు రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, మహబూబ్నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల తదితర జిల్లాల్లో ఈదురుగాలులతో భారీ వర్షాలు కురిశాయి. మరికొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాపాతం నమోదైంది.