TS Weather | తెలంగాణలో రాగల ఐదురోజుల పాటు ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వడగండ్లు వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది.
ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ను జారీ చేసింది. మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, భువనగిరి, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ను ప్రకటించింది. సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపింది. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వానలు పడే సూచనలున్నాయని చెప్పింది.
మంగళవారం నుంచి బుధవారం కరీంనగర్, నల్గొండ, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, ఆదిలాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. బుధవారం నుంచి శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయన్న పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.