హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలగకుండా చూడాలని టీఎస్ ట్రాన్స్కో, టీఎస్ జెన్కో సీఎండీ ప్రభాకర్రావు సూచించారు. విద్యుత్ సరఫరాకు సంబంధించి గురువారం ప్రభాకర్రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… విద్యుత్శాఖ ఇంజినీర్లు హెడ్క్వార్టర్స్లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
ఎమర్జెన్సీ, బ్రేక్డౌన్ సమయాల్లో సేవలు అందించేందుకు ఈహెచ్టీ సబ్స్టేషన్లలో సెంట్రల్ బ్రేక్డౌన్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. విద్యుత్ ఉత్పాదక కేంద్రాల్లో బొగ్గు నిల్వలు సరిపడా ఉన్నాయని పేర్కొన్నారు. కృష్ణా బేసిన్లో వచ్చే ఇన్ఫ్లోను బట్టి హైడల్ ఉత్పత్తి ప్రారంభం అవుతుందని వివరించారు. ఇంజినీర్లు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు.