హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): జూన్ చివరి వారంలో పాలిసెట్-2022 నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఇటీవల నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో పాలిసెట్ నిర్వహణపై అధికారులు సమీక్షించారు. పదో తరగతి పరీక్షలు ముగిసిన తర్వాత నెలరోజులు సమయం ఇచ్చి పాలిసెట్ నిర్వహించాలని భావిస్తున్నారు. పదో తరగతి పరీక్షలు మే 23న ప్రారంభమై, జూన్ 1 ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ చివరి వారంలో పాలిసెట్ నిర్వహించేందుకు అనుకూలంగా ఉంటుందని అధికారులు తేల్చారు. త్వరలో పాలిసెట్కు సంబంధిం చిన పూర్తి షెడ్యూల్ విడుదల చేస్తామని అధికారులు వెల్లడించారు.