TS PGECET | హైదరాబాద్ : టీఎస్ పీజీఈసెట్-2024 రాత పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేసినట్లు కన్వీనర్ డాక్టర్ ఏ అరుణ కుమారి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలు, టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షల నేపథ్యంలో టీఎస్ పీజీఈసెట్ రాత పరీక్షల షెడ్యూల్లో మార్పులు చేసినట్లు వెల్లడించారు. జూన్ 6 నుంచి 9వ తేదీ వరకు జరగాల్సిన పీజీఈసెట్ రాతపరీక్షలను జూన్ 10 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించనున్నారు. అభ్యర్థులు ఈ స్వల్ప మార్పును గమనించాలని కన్వీనర్ కోరారు.