హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): టీఎస్ ఎంసెట్ ఫలితాలు ఈ నెల 25న విడుదలకానున్నాయి. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ జేఎన్టీయూ క్యాంపస్లోని గోల్డెన్ జూబ్లీహాల్లో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేస్తారు.
ఫలితాలను www.ntnews.com,eamcet.tsche.ac.in వెబ్సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు. మంగళవారం జేఎన్టీయూలో ఎంసెట్ కమిటీ సమావేశమైంది. పలు అంశాలపై చర్చించి, 25న ఫలితాల విడుదలకు నిర్ణయం తీసుకొన్నది.