TS Minister Satyavathi Rathode | ములుగు జిల్లా మల్లంపల్లి కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం నూతన మండలం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం మల్లంపల్లిలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ మల్లంపల్లి కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటు చేసినందుకు హర్షం వ్యక్తం చేశారు. మల్లంపల్లి వాసుల కోరిక నెరవేర్చినందుకు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులకు సత్యవతి రాథోడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఎన్నో ఏండ్ల తరబడి ఎదురుచూస్తున్న మల్లంపల్లి ప్రజల కలను సీఎం కేసీఆర్ నెరవేర్చారని సత్యవతి రాథోడ్ అన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం తెలంగాణ నూతన మండలాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ మాళోత్ కవిత, జడ్పీ చైర్ పర్సన్ బడే నాగజ్యోతి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు లక్ష్మణరావు, గ్రంధాలయ చైర్మన్ పోరిక గోవింద నాయక్, రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి, స్థానిక సర్పంచ్ కుమారస్వామి, ఎంపీటీసీ ప్రభాకర్, మండల ప్రెసిడెంట్ ప్రవీణ్, స్థానిక బీఆర్ఎస్ నాయకులు, మల్లంపల్లి వాసులు పాల్గొన్నారు.