TS Minister KTR | చేవెళ్లలో కాంగ్రెస్ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ సభపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ స్పందించారు. ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ట్వీట్ చేశారు. తనదైన శైలిలో సెటైర్లు వేశారు. అది డిక్లరేషన్ సభ కాదు.. అధికారం రాదనే ప్రస్టేషన్తో నిర్వహించుకున్న సభ అని ఎద్దేవా చేశారు.
‘అది డిక్లరేషన్ సభ కాదు.. తమకు అధికారం రానే రాదని నిర్ణయానికి వచ్చి కాంగ్రెస్ నిర్వహించుకున్న ప్రస్టేషన్ సభ. కర్ణాటకలో కనీసం రేషన్ ఇవ్వలేని కాంగ్రెస్.. తెలంగాణకు వచ్చి డిక్లరేషన్ ఇస్తే నమ్మేదెవరు? గాడ్సేనే గెలుస్తాడన్న గ్యారంటీ లేదు. మీ 12 గ్యారంటీలకు విలువ ఎక్కడిది? చైతన్యానికి ప్రతీకలైన తెలంగాణ ప్రజలకు తెలుసు. ఎస్సీ, ఎస్టీ డిక్లరేసన్ పేరిట విజన్ లేని కాంగ్రెస్ ఇచ్చిన డజన్ హామీలు గాల్లో దీపాలే’ అని ట్వీట్ చేశారు.
దేశానికి స్వాతంత్రం వచ్చిన 75 ఏండ్ల తర్వాత ఎస్సీ ఎస్టీలు వెనకబడి ఉండటానికి ప్రధాన దోషి కాంగ్రెస్ పార్టీ. దళిత, గిరిజన బిడ్డలకు కాంగ్రెస్ చేసిన దశాబ్దాల పాపమే. ఆ పార్టీని మరో వందేండ్లైనా శాపంలా వెంటాడుతూనే ఉంటుంది. కర్ణాటకలో నమ్మి ఓటేసిన ప్రజలను నట్టేట ముంచిన కాంగ్రెస్ పార్టీకి పాలించే అర్హత లేదు. ప్రజల్లో క్రెడిబిలిటీ లేదు. తెలంగాణ రాష్ట్రం అంటేనే దేశానికి ఓ పరిపాలనా పాఠం. ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చని పార్టీ మీది. ఇవ్వన్ని హామీలెన్నో అమలు చేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీది. తెలంగాణలో బీజేపీకి చరిత్ర లేదు. కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదు. చరిత్ర, భవిష్యత్ ఉన్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమే’ అని పేర్కొన్నారు.
అది డిక్లరేషన్ సభ కాదు…
అధికారం రానే రాదనే…
కాంగ్రెస్ ఫ్రస్ట్రేషన్ సభకర్ణాటకలో కనీసం రేషన్.. ఇవ్వలేని కాంగ్రెస్
తెలంగాణకొచ్చి డిక్లరేషన్.. ఇస్తే నమ్మేదెవరు ?గాడ్సేనే గెలుస్తాడన్న గ్యారెంటీ లేదు
మీ 12 గ్యారెంటీలకు విలువ ఎక్కడిదిచైతన్యానికి ప్రతీకైన
తెలంగాణ ప్రజలకు…— KTR (@KTRBRS) August 27, 2023