జనగామ, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ బీజేపీ పెద్దలకు బానిస పనులు చేసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని అపహాస్యం చేసిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి మునుగోడు ప్రజలు చెప్పుతో కొట్టేలా తీర్పు ఇచ్చారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మంగళవారం జనగామలో ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, టీ రాజయ్య, జడ్పీచైర్మన్ పాగాల సంపత్రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. అమిత్షా చెప్పులు మోసిన బీజేపీ అధ్యక్షుడిని ఢిల్లీకి వినిపించేలా మునుగోడు ప్రజలు ఫెడేల్మని కొట్టారని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వ కుట్రకు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి బలిపశువుగా మారాడని చెప్పారు.
ఒక్కో ఎమ్మెల్యేకు వంద కోట్ల ఆఫర్ ఇచ్చి పార్టీలో చేర్చుకొని కేసీఆర్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఢిల్లీ గద్దలు పన్నిన కుట్రను మునుగోడు ప్రజలు తెలుసుకున్నారన్నారు. బయ్యారం ఉకు ఫ్యాక్టరీ తీసుకురాలేని కేంద్రమంత్రి కిషన్రెడ్డికి సిగ్గు లేదని, సొంత నియోజకవర్గం కరీంనగర్కు కనీసం మెడికల్ కాలేజీ కూడా తెచ్చుకోలేని దద్దమ్మ బండి సం జయ్ అంటూ దుయ్యబట్టారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం కేంద్రమేనని, దీని ప్రభావం రాష్ట్రంలో అన్ని రకాల నిత్యావసరాలు, సామాన్య ప్రజల జీవనంపై పడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. అకరలేని ఎన్నిక తెచ్చిన బీజేపీకి బుద్ధి చెప్పిన మునుగోడు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
బీఆర్ఎస్కు బాటలు..
దేశ రాజకీయాల్లో కీలక మలుపు తిప్పే బీఆర్ఎస్ పార్టీకి బాటలు వేసేలా మునుగోడు ప్రజలు తమ తీర్పుతో ఆశీర్వదించారని మంత్రి ఎర్రబెల్లి సంతోషం వ్యక్తంచేశారు. ఉప ఎన్నికలో ప్రగల్భాలు పలికిన కేంద్రమంత్రులు, బీజేపీ నాయకులు ఏపీలో విలీనం చేసిన 7 మండలాలను తిరిగి తెలంగాణకు ఇప్పించాలని మంత్రి డిమాండ్ చేశారు.