హైదరాబాద్ : మూడేండ్లు, ఐదేండ్ల లా కోర్సులతోపాటు, ఎల్ఎల్ఎం కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన లా, పీజీలాసెట్ ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి మధ్యాహ్నం 3:30 గంటలకు విడుదల చేయనున్నారు. జూలై 20, 21 తేదీల్లో నిర్వహించిన ప్రవేశ పరీక్షలకు 82.46 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు.