హైదరాబాద్ : లా సెట్, పీజీఎల్ సెట్ షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 6వ తేదీ నుంచి జూన్ 6వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆలస్య రుసుముతో జూలై 12వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సెట్ కన్వీనర్ తెలిపారు. మూడేళ్ల ఎల్ఎల్బీ కోసం జూలై 21 లా సెట్, ఐదు సంవత్సరాల ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోసం జూలై 22న ప్రవేశ పరీక్షలు జరుగనున్నాయి. రాష్ట్రంలో ఆన్లైన్ పద్ధతిలో 2022-23 విద్యా సంవత్సరానికిగాను డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే టీఎస్ లాసెట్, టీఎస్ పీజీఎల్సెట్ నోటిఫికేషన్ను ఈ నెల 29న ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబ్రాది విడుదల చేసిన విషయం తెలిసిందే.