హైదరాబాద్ : తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు మంగళవారంతో ముగియనున్నాయి. ఫస్టియర్, సెకండియర్లో కలిపి ఈ ఏడాది మొత్తం 9,07,393 మంది విద్యార్థులకు పరీక్షలకు హాజరయ్యారు. ఈ నెల 6వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 1,443 కేంద్రాలు కేంద్రాల్లో పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. వైపు వచ్చే నెల 20 నాటికి ఫలితాలను ప్రకటించేందుకు బోర్డు కసరత్తు చేస్తున్నది.
ఇందులో భాగంగా ఈ నెల 12 నుంచి రాష్ట్రంలోని 14 కేంద్రాలను చేసి, మూల్యాంకనం చేపడుతున్నది. జూన్ రెండో వారం చివరి నాటికి స్పాట్ వాల్యుయేషన్ పూర్తి చేయాలని బోర్డు లక్ష్యంగా నిర్దేశించుకున్నది. సోమవారం ప్రథమ సంవత్సరం విద్యార్థులకు మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1, జాగ్రఫీ పేపర్-1 పరీక్షలు జరగ్గా.. వీటికి 490 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 471 మంది హాజరయ్యారని ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ వివరించారు.