హైదరాబాద్ : యువత కోసం ప్రత్యేక ఇంక్యుబేషన్ సెంటర్ వై-హబ్ను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. యువ ఆవిష్కర్తలను గుర్తించి.. వారిని ఔత్సాహక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్నారు. ఆవిష్కరణలు, సమ్మిళిత అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. సోమవారం తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్ ముగింపు కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు రూపొందించిన వివిధ ఆవిష్కరణలను మంత్రి పరిశీలించి, వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వై-హబ్ ఏర్పాటుపై ప్రకటించారు. యువతకు వారి ఆవిష్కరణ సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి అనుకూలమైన వేదికను అందిస్తుందన్నారు. ఈ క్రమంలో కేటీఆర్.. వై- హబ్కు సంబంధించి ప్రకటించారు. ప్రస్తుతం ‘వై-హబ్’ ఏర్పాటు దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు.
After Telangana Govt’s @THubHyd @WEHubHyderabad and @TWorksHyd now @teamTSIC is geared up to launch Y-Hub 👍
We need to catch our innovators at a young age and nurture them to be able entrepreneurs
Telangana believes in the power of Innovation & inclusive growth pic.twitter.com/jftRBtbewD
— KTR (@KTRTRS) April 5, 2022