TSPSC | హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) కు ప్రభుత్వం రూ. 40 కోట్ల నిధులు విడుదల చేసింది. టీఎస్పీఎస్సీకి నిధులు విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బడ్జెట్ కేటాయింపుల్లోంచి రూ. 40 కోట్లు విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. నిధులు ఇవ్వాలని కొంతకాలంగా ప్రభుత్వాన్ని టీఎస్పీఎస్సీ కోరుతోంది. మొత్తానికి టీఎస్పీఎస్సీకి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.