CM KCR | వరిధాన్యం ఉత్పత్తిలో నంబర్ వన్ స్థానానికి చేరుకుంటున్న తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నపూర్ణగా నిలిచిందని సీఎం కేసీఆర్ అన్నారు. వరిధాన్యాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ చేసి బియ్యంగా మార్చి ఇతర రాష్ట్రాలకు చేసే ఎగుమతులను మరింతగా ప్రోత్సహిస్తామని, ఆ దిశగా చర్యలు చేపడుతామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఇతర రాష్ట్రాలకు బియ్యం ఎగుమతి చేసే సందర్భంగా ఇచ్చే (01.04.2015 నుంచి 30.06.2017 మధ్య కాలంలో) రెండుశాతం సీఎస్టీ పన్ను బకాయిని రద్దు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. తద్వారా బియ్యం ఎగుమతులను ప్రోత్సహించి తెలంగాణ రైసు మిల్లర్ల ప్రయోజనాలను, రైతుల ప్రయోజనాలను తెలంగాణ ప్రభుత్వం కాపాడుతుందని పునరుద్ఘాటించారు.
తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు బియ్యం ఎగుమతి చేసే సందర్భాల్లో గతంలో సీ- ఫారం దాఖలు చేస్తే (సీఎస్టీ) టాక్స్లో రెండుశాతం రాయితీని కల్పించే విధానం ఉండేది. ఈ విధానం ఉమ్మడి రాష్ట్రంలో అమలైంది. అనంతరం తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభంలో అమలైంది. కాగా, 01.04.2015 నుంచి 30.06.2017 మధ్య కాలంలో రాష్ట్రం నుంచి చేసిన బియ్యం ఎగుమతులకు సి- ఫారం సబ్మిట్ చేయలేదనే కారణం చేత బియ్యం ఎగుమతి దారులకు సీఎస్టీలో 2 శాతం పన్ను రాయితీ కల్పించడం నిలిపివేశారు. సీ-ఫారం సబ్మిట్ చేయలేదనే పేరుతో తెలంగాణ రైస్ మిల్లర్లకు 2శాతం పన్ను రాయితీని అవకాశాన్ని కల్పించకపోవడంతో తాము ఆర్థికంగా నష్టపోతున్నామని గత కొంత కాలంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని పలు సందర్భాల్లో రైస్ మిల్లర్ల అసోషియేషన్ ప్రతినిధులు అభ్యర్థిస్తూ వస్తున్నారు. బియ్యం ఎగుమతి చేశామా? లేదా ? అనే అనేది నిర్ధారణ చేసుకోవడమే సీ ఫారం ఉద్దేశమని.. అది లేనంత మాత్రాన తమ హక్కును ఎలా రద్దు చేస్తారని పలుమార్లు ప్రభుత్వం వద్ద మొరపెట్టుకున్నారు.
సీ-ఫారం బదులు తాము ఎగుమతులు చేసినట్లుగా నిర్ధారించుకునేందుకు ఇతర పద్దతులను పరిశీలించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. తాము చేసిన లోడింగ్, రిలీజింగ్, సర్టిఫికెట్లు, లారీలు రైల్వే పర్మిట్లు , వే బిల్లులు తదితర ఏ ప్రూఫ్ నైనా తాము సబ్మిట్ చేస్తామని, వాటిని పరిగణలోకి తీసుకుని రెండేండ్ల కాలానికి సంబంధించిన 2శాతం పన్నును రద్దు చేయాలని కోరారు. ఇదే విషయాన్ని నేటి దామరచర్ల పర్యటన సందర్భంగా, మిర్యాలగూడెం ఎమ్మెల్యే భాస్కర్రావు ఆధ్వర్యంలో మంత్రి జగదీశ్ రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డితో కూడి తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోషియేషన్ ప్రతినిధులు సీఎం కేసీఆర్ను కలిసి విజ్ఞప్తి చేశారు.
తమకు న్యాయం జరిగేలా చూడాలని విన్నవించుకున్నారు. వారి అభ్యర్థనను పరిశీలించిన సీఎం కేసీఆర్.. ఇందులో కేవలం తెలంగాణ రైస్ మిల్లర్లతో పాటు రైతాంగ ప్రయోజనం కూడా ఇమిడి ఉందని గ్రహించారు. తెలంగాణ రాష్ట్రం అద్భుతంగా వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తున్న నేపథ్యంలో బియ్యం ఎగుమతులను ప్రోత్సహించిడం రాష్ట్ర ప్రభుత్వ కర్తవ్యంగా భావించారు. తద్వారా తెలంగాణ రైతాంగానికి మేలు చేసినట్లవుతుందని సీఎం నిర్ణయించుకున్నారు. తెలంగాణ రైస్ మిల్లర్ల అభ్యర్థనను పరిశీలించి, ఎలాంటి సాయం చేయవచ్చునో ఆలోచించాలని, తక్షణమే ఇందుకు సంబంధించి చర్యలు తీసుకోవాలని సీఎస్ సోమేశ్కుమార్ను ఆదేశించారు.
అటు మిల్లర్లతో పాటు తెలంగాణ రైతులకు ప్రయోజనం కలిగేలా సమాలోచనలు చేయాలని రైతుబంధు సమితి అధ్యక్షుడిని సీఎం ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మేరకు క్షుణ్ణంగా పరిశీలించిన మీదట.. రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు చేసిన సందర్భంలో సీ-ఫారం బదులు అందుకు సామానమైనచ లోడింగ్ సందర్భంగా ఇచ్చే సర్టిఫికెట్లు, బియ్యం అన్లోడ్ చేస్తున్న సందర్భంగా ఉండే బిల్లులు, వే బిల్లులు, లారీలు రైల్వేల ద్వారా చేసే రవాణా పర్మిట్లకు సంబంధించిన పత్రాలు ఏవి ఉన్నా సబ్మిట్ చేసి ఎగుమతి చేసినట్టు నిర్ధారించేలా వాటిని సీ-ఫారం ప్లేస్లో పరిగణలోకి తీసుకోవచ్చునని, ఈ నేపథ్యంలో 01.04.2015 నుంచి 30.06.2017 కాలానికి నడుమ రాయితీ ఇవ్వకుండా నిలిపివేసిన 2శాతం పన్నును రద్దు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. సీఎం ఆదేశాల మేరకు గారి ఆదేశాల మేరకు అందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ రైస్ మిల్లర్లకు రైతాంగం తరఫున ఎమ్మెల్యే నలమోతు భాస్కర్రావు, రైతు బంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.