హైదరాబాద్: దళితుల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు పరుస్తున్న దళితబంధు పథకం కోసం నిధులు విడుదలయ్యాయి. సీఎం కేసీఆర్ ఆదేశాలమేరకు రూ.250 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నాడు విడుదల చేసింది. ఈ మేరకు ఆర్ధికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ నిధుల్లో రూ. 100 కోట్లను ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలానికి, రూ. 50 కోట్లను సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం లోని తిర్మలగిరి మండలానికి, అలాగే నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట కల్వకుర్తి నియోజకవర్గాలలోని చారగొండ మండలానికి మరో రూ. 50 కోట్లు, కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాం సాగర్ మండలానికి రూ.50 కోట్లు నిధులు విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.