హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ) : టీఎస్ ఈసెట్ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. హైదరాబాద్ మాసబ్ట్యాంక్లోని కార్యాలయంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి ఫలితాల వివరాలను వెల్లడించారు. మొత్తం 20,899 (93.07%) మంది విద్యార్థులు అర్హత సాధించినట్టు తెలిపారు. వీరిలో 14,415 ( 92.19%) మంది అబ్బాయిలు, 6,484( 95.10శాతం) మంది అమ్మాయిలు ఉన్నట్టు వివరించారు. మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో మేడ్చల్ జిల్లాకు చెందిన కొండూరి ఫణిశంకర్ అనిరుధ్ 171 మార్కులతో మొదటి ర్యాంకు సాధించారు.
హనుమకొండ జిల్లాకు చెందిన అర్షియా జాస్మిన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో 163మార్కులతో అగ్రభాగాన నిలిచారు. ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్లో పుర్మ ఆకాంక్ష (జనగామ) 163, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్లో అన్నం అక్షర (సంగారెడ్డి) 158 మార్కులతో, సివిల్ ఇంజినీరింగ్లో మార్త సాత్విక్ (రంగారెడ్డి) 161 మార్కులతో ప్రథమస్థానాలను కైవసం చేసుకొన్నారని లింబాద్రి వివరించారు. త్వరలోనే సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని వెల్లడించారు.