TSECET | హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ) : పాలిటెక్నిక్, బీఎస్సీ గణితం పూర్తిచేసిన వారికి బీటెక్లో ల్యాట్రల్ ఎంట్రీ కోసం నిర్వహించే టీఎస్ ఈసెట్ షెడ్యూల్ విడుదలైంది. 14న టీఎస్ ఈసెట్ నోటిఫికేషన్ విడుదల కానుండగా, 15 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తారు. శుక్రవారం హైదరాబాద్ మాసబ్ట్యాంక్లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఈసెట్ కమిటీ మొదటి సమావేశం జరిగింది.
ఇందులో ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి, వైస్ చైర్మన్ ఎస్కే మహమూద్, ఉస్మానియా వీసీ డీ రవీందర్, ఉన్నత విద్యామండలి కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈసెట్ -24 షెడ్యూల్ను ఖరారు చేసి, విడుదల చేశారు. ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 16 వరకు ఈసెట్కు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ. 500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 22, రూ.1000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 28 వరకు దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉన్నది. ఏప్రిల్ 24 నుంచి 28 వరకు దరఖాస్తుల సవరించుకోవచ్చు. మే 1 నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. మే 6న ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఈసెట్ పరీక్ష నిర్వహిస్తారు.