TS Elections Code | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.243కోట్లకుపైగా విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి గురువారం వరకు మొత్తంగా రూ.243.76కోట్ల విలువ డబ్బు, ఆభరణాలు, మద్యం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. నిన్న ఒకే రోజు తనిఖీల్లో రూ.78.03కోట్ల సొత్తును అధికారులు పట్టుకున్నారు.
తనిఖీల్లో రూ.120.40కోట్ల విలువైన బంగారం, వెండి వస్తువులను పట్టుకున్నారు. 24గంటల్లో 83 కిలోల బంగారం 213 కిలోల వెండి, 113 క్యారెట్ల వజ్రాలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ పరిధిలోని చైతన్యపురిలో ఓ వ్యక్తి నుంచి రూ.97లక్షలను పోలీసులు గుర్తించి.. పట్టుకున్నారు. సదరు వ్యక్తిని రాజేశ్గా గుర్తించారు. డబ్బంతా బ్రింక్స్ ఇండియా కంపెనీకి చెందిందని, అందులో తాను కలెక్షన్ ఎగ్జిక్యూటివ్గా పని చేస్తున్నట్లు వెల్లడించారు. నగదుకు సంబంధించి ఎలాంటి పత్రాలు చూపకపోవడంతో నగదును స్వాధీనం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.