హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రకల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న ఎంసెట్ (EAMCET) నోటిఫికేషన్ ఈనెల 28న విడుదల కానుంది. మార్చి 3 నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభంకానున్నాయి. ఎలాంటి అపరాద రుసుము లేకుండా ఏప్రిల్ 10 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఫ్రొఫెసర్ లింబాద్రి ఎంసెట్ షెడ్యూల్ను విడుదల చేశారు. మే 7 నుంచి 11 వరకు ఎంసెట్ నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. మే 7 నుంచి 9 వరకు ఇంజినీరింగ్, మే 10 నుంచి 11 వరకు అగ్రికల్చర్, ఫార్మసీ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు.
2023-24 విద్యాసంవత్సరానికి గాను ఇంజినీరింగ్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పీజీఈసెట్-2023 (PGECET) షెడ్యూల్ను కూడా ప్రొఫెసర్ లింబాద్రి విడుదల చేశారు. పూర్తిస్థాయి నోటిఫికేషన్ ఈ నెల 28న విడుదల కానుంది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 3 నుంచి ఏప్రిల్ 30 వరకు కొనసాగనుంది. పరీక్షలను మే 29 నుంచి జూన్ 1 వరకు నిర్వహిస్తారు.