హైదరాబాద్ : టీఎస్ ఎంసెట్ -2022 పరీక్ష తొలి రోజు ప్రశాంతంగా ముగిసింది. తెలంగాణ, ఏపీలో సోమవారం నిర్వహించిన రెండు సెషన్లకు 91.4 శాతం మంది విద్యార్థులు ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షకు హాజరైనట్లు కన్వీనర్ ప్రొఫెసర్ ఏ గోవర్ధన్ వెల్లడించారు. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 99.1 శాతం మంది విద్యార్థులు హాజరు కాగా, అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో 88.9 శాతం మంది హాజరయ్యారు. తొలి రోజు జరిగిన ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షకు 58,548 మంది విద్యార్థులకు గానూ 53,509 మంది విద్యార్థులు హాజరయ్యారు. రేపు, ఎల్లుండి కూడా ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు కొనసాగనున్నాయి.