హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ) : టీచర్ నియామక పరీక్ష డీఎస్సీ దరఖాస్తుల సవరణ గడువును పాఠశాల విద్యాశాఖ ఈ నెల 8 వరకు పొడిగించింది. వాస్తవానికి సవరణ గడువు ఆదివారం ముగియగా, మరోసారి అవకాశం ఇచ్చింది.
రాష్ట్రంలో 5,089 టీచర్ పోస్టుల భర్తీకి విద్యాశాఖ నోటిఫికేషన్ను జారీచేసిన విషయం తెలిసిందే. దరఖాస్తుల స్వీ కరణ గడువు గత అక్టోబర్ 28న ముగియగా, మొత్తం 1.77లక్షల దరఖాస్తులొచ్చాయి.