హైదరాబాద్ : మార్చి 7 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11:30 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కానుంది. అదే రోజు రాష్ట్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి హరీశ్రావు ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో మార్చి 6న సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ సమావేశంలో రాష్ట్ర బడ్జెట్కు ఆమోదం తెలుపనున్నారు. ఇక సభ ఎన్ని రోజులు జరగాలి అనే విషయంపై బీఏసీ సమావేశంలో చర్చించి సోమవారం నిర్ణయం తీసుకోనున్నారు.
తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అసెంబ్లీ పరిసరాల్లో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. ముఖ్యమంత్రి, స్పీకర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వీరి పీఏలు, ఇతర సిబ్బందికి కావాల్సిన ఏర్పాట్లను పూర్తి చేశారు. అసెంబ్లీ ఆవరణలో సైన్ బోర్డులు ఏర్పాటు చేసి.. ఎవరికీ ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నారు.