హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ జవాబు పత్రాలను ఆన్లైన్లో మూల్యాంకనం చేసేందుకు చకచకా అడుగులు పడుతున్నాయి. ఈ విద్యాసంవత్సరం నుంచే ఆన్స్క్రీన్ మూల్యాంకనం చేయాలని ఇటీవలే ఇంటర్ బోర్డు నిర్ణయించింది. అందుకు అవసరమైన చర్యలను చేపట్టింది. ఈ ఏడాది 35 లక్షల జవాబుపత్రాలను మూల్యాంకనం చేసేందుకు టెండర్లను ఆహ్వానించింది. బిడ్ల దాఖలుకు బుధవారం నుంచి ఫిబ్రవరి 9వరకు అవకాశం కల్పించింది. బార్కోడ్ ఆధారంగా జవాబు పత్రాలను స్కాన్ చేసి వాల్యుయేటర్లకు పంపించి మూల్యాంకనం చేయడం ఈ విధానం ప్రత్యేకత.
మూడేండ్లలో పూర్తిస్థాయిలో
ఇంటర్ వార్షిక పరీక్షలకు ఏటా 10 లక్షల మంది విద్యార్థులు, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు 5 లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నారు. వొకేషనల్ పరీక్షలను 70వేల మంది విద్యార్థులు, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను 40 వేల మంది విద్యార్థులు రాస్తున్నారు. వీరి జవాబుపత్రాలను మొత్తం మూడు విడతల్లో ఆన్స్క్రీన్ మూల్యాంకనం చేయాలని ఇంటర్ బోర్డు అధికారులు నిర్ణయించారు. ఈ ఏడాది 35 లక్షలు, వచ్చే ఏడాది 45 లక్షలు, 2025లో 55 లక్షల జవాబుపత్రాలను మూల్యాంకనం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆన్స్క్రీన్ మూల్యాంకనంలో ఈ విద్యాసంవత్సరం సైన్స్ సబ్జెక్టులను మినహాయించారు. 2024లో 50 శాతం సైన్స్ పేపర్లు, 2025లో మొత్తం పేపర్లను ఆన్స్క్రీన్ మూల్యాంకనం చేయాలని నిర్ణయించారు.
అమలు తీరు
లాభాలు