TS Assembly Live Updates | తెలంగాణలో తొలిసారిగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారిగా బడ్జెట్ను (Budget) ప్రవేశపెట్టింది. అయితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పూర్తిస్థాయిలో కాకుండా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను రూపొందించింది. మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మండలిలో మంత్రి శ్రీధర్బాబు బడ్జెట్ ప్రతిపాదనలను చదివి వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ కమిటీ హాల్లో సమవేశమైన రాష్ట్ర మంత్రి మండలి బడ్జెట్కు ఆమోదం తెలిపింది. కాగా, ఈ సారి సుమారు రూ.2.72 లక్షల కోట్లతో బడ్జెట్ను ప్రతిపాదించవచ్చని తెలుస్తున్నది. అయితే ఇది గత బడ్జెట్ కంటే రూ. 20 వేల కోట్లు తక్కువ.
ముంబై రెండో వికెట్ పడింది. కమిన్స్ ఓవర్లో సిక్సర్ బాదిన రోహిత్ శర్మ(26) ఆ తర్వాత బంతికే వెనుదిరిగాడు. దాంతో, 66 వద్ద ముంబై రెండో వికెట్ పడింది. నమన్ ధార్(7), తిలక్ వర్మ(4)లు ఆడుతున్నారు. 6 ఓవర్లకు స్కోర్.. 76-2. అంతకుముందు ఓపెనర్ ఇషాన్ కిషన్(34) ఔటయ్యాడు.
End of powerplay!
Mumbai Indians move to 76/2 but they lose Rohit Sharma's wicket in the chase.
Follow the Match ▶️ https://t.co/oi6mgyCP5s#TATAIPL | #SRHvMI pic.twitter.com/UtuwWfqrjV
— IndianPremierLeague (@IPL) March 27, 2024
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. సోమవారం ఉదయం 10 గంటలకు సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. అంతకుముందు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన భట్టి ప్రసంగం మధ్యాహ్నం 1:20 గంటలకు ముగిసింది. అనంతరం సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ. 2,75,891 కోట్లతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు.
రాష్ట్రంలోని అర్హులైన కుటుంబాలకు గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల విద్యుత్ను ఉచితంగా అందించబోతున్నామని ఆర్థిక భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ పథకం అమలుకు ఇప్పటికే మంత్రివర్గ నిర్ణయం జరిగిందన్నారు. దాని అమలుకు కావాల్సిన సత్వర చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ పథకం అమలుకు బడ్జెట్లో రూ. 2,418 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలోని ట్రాన్స్కో, డిస్కమ్లకు రూ. 16,825 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు భట్టి తెలిపారు. రాష్ట్రంలోని రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ను అందించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని భట్టి స్పష్టం చేశారు.
నాసిరకం విత్తనాలను, నకిలీ విత్తనాలను అరికట్టేందుకు తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని భట్టి విక్రమార్క తెలిపారు. రైతుకు నష్టం చేసే ఏ విత్తన వ్యాపారినీ కూడా తమ ప్రభుత్వం ఉపేక్షించదు. నాణ్యమైన విత్తన ఉత్పత్తి విషయాల్లో పురోభివృద్ధి సాధించేందుకు సకల చర్యలు తీసుకుంటున్నాం. ఈ మేరకు త్వరలో ఒక నూతన విత్తన విధానం తీసుకురాబోతున్నామని భట్టి విక్రమార్క తెలిపారు.
రాష్ట్రంలోని కౌలు రైతులకు కూడా రైతు భరోసా సాయాన్ని ఇవ్వడానికి మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నామని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రకటించారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. రైతుబంధు నిబంధనలను పునఃసమీక్ష చేసి నిజమైన అర్హులకు రైతు భరోసా కింద ఎకరాకు రూ. 15 వేలు అందించేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని తెలిపారు. అదే విధంగా ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన కార్యక్రమాన్ని ఆధారంగా చేసుకుని రాష్ట్రంలో పంటల భీమా పథకాన్ని పటిష్టంగా అమలు చేయబోతున్నామని తెలిపారు. రైతుబీమా పథకాన్ని కౌలు రైతులకు కూడా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అందుకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందిస్తున్నామని చెప్పారు.
రైతుల రుణమాఫీపై డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. శాసనసభలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా భట్టి రైతు రుణమాఫీపై మాట్లాడారు. ఎన్నికల ముందు ప్రజలకు హామీ ఇచ్చిన విధంగానే రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేయబోతున్నామని తెలిపారు. రూ. 2 లక్షల రుణమాఫీపై త్వరలోనే కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు. అందుకు విధివిధానాలను రూపొందిస్తున్నాం. ప్రతి పంటకు మద్దతు ధర కూడా అందిస్తామన్నారు.
నీటిపారుదల శాఖకు రూ. 28,024 కోట్లు
విద్యారంగానికి రూ. 21,389 కోట్లు
వైద్యారోగ్య రంగానికి రూ. 11,500 కోట్లు
గృహజ్యోతి పథకానికి రూ. 2,418 కోట్లు
ట్రాన్స్కో, డిస్కమ్లకు రూ. 16,825 కోట్లు
గృహ నిర్మాణ శాఖకు రూ. 7,740 కోట్లు
ఎస్సీ గురుకులాల భవన నిర్మాణాలకు రూ. 1000 కోట్లు
ఎస్టీ గురుకులాల భవన నిర్మాణాలకు రూ. 250 కోట్లు
ఎస్సీ సంక్షేమానికి రూ. 21,874 కోట్లు
ఎస్టీ సంక్షేమానికి రూ. 13,313 కోట్లు
మైనార్టీ సంక్షేమానికి రూ. 2,262 కోట్లు
బీసీ గురుకులాల స్వంత భవనాల నిర్మాణానికి రూ. 1,546 కోట్లు
బీసీ సంక్షేమానికి రూ. 8,000 కోట్లు
పరిశ్రమల శాఖకు రూ. 2,543 కోట్లు కేటాయింపు..
ఐటీ శాఖకు రూ. 774 కోట్లు కేటాయింపు
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ. 40,080 కోట్లు
మూసీ నది అభివృద్ధి కోసం రూ. 1000 కోట్లు
పురపాలక శాఖకు రూ. 11,692 కోట్లు
వ్యవసాయ శాఖకు రూ. 19,746 కోట్లు
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల అమలుకు రూ. 53,196 కోట్లు ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు. ఈ కేటాయింపు ఒక ప్రాథమిక అంచనా ప్రకారం మాత్రమే చేయడం జరిగిందన్నారు. హామీలకు సంబంధించిన విధివిధానాలను రూపొందించే పని ఇంకా కొనసాగుతున్నందున, అది పూర్తయిన వెంటనే అమలుకు అవసరమైన పూర్తి నిధులు కేటాయిస్తాం అని విక్రమార్క తెలిపారు.
రూ. 2,75,891 కోట్లతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్
రెవెన్యూ వ్యయం రూ. 2,01,178 కోట్లు
మూలధన వ్యయం రూ. 29,669 కోట్లు
రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వనరులతో అభివృద్ధికి కృషి చేస్తున్నాం. ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి. మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆర్థికంగా ఎంత వెనుకబడిపోయామంటే.. ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేని పరిస్థితి. దీనివల్ల ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిని, జీవితాలను దుర్బరం చేసిన పాలనకు స్వస్తి పలికారు. దివాలా తీసిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తున్నాం.
సామాజిక, రాజకీయ, ఆర్థిక న్యాయాన్ని అందించే స్ఫూర్తితో బడ్జెట్ను రూపొందించాం. నిస్సహాయులకు సహాయం చేయడమే మా విధానం. దశాబ్దాల ఆకాంక్షను గౌరవిస్తూ 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది యూపీఏ ప్రభుత్వం. సమానత్వమే మా లక్ష్యం. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తీర్చడానికి ఏ మాత్రం వెనుకాడం. నిర్బంధాలు, నియంతృత్వ దోరణులు ఉండవని చెప్పాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాం. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నాం.
అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను డిప్యూటి సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. అనంతరం బడ్జెట్ ప్రసంగాన్ని చదివి వినిపిస్తున్నారు. మార్పును కోరుతూ తెలంగాణ ప్రజలు మా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. తెలంగాణ ప్రజలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.
అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మండలిలో శ్రీధర్ బాబు బడ్జెట్ ప్రతిపాదనలను చదివి వినిపిస్తున్నారు.
ఎలాంటి చర్చ లేకుండా శాసనసభ ఆమోదించే బడ్జెట్ను ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటారు. ప్రభుత్వం తమ వ్యయాలను కొంత కాలానికి మాత్రమే కొనసాగించడానికి రూపొందించే బడ్జెట్ ఇది. ఇందులో వ్యయానికి ప్రాధాన్యం ఇస్తారు.