హైదరాబాద్ : ఈ నెల 16న సాయంత్రం 4 గంటలకు తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు.
తెలంగాణలో వరిధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని అవలంభిస్తూ, తెలంగాణ రైతులను, ప్రజలను అయోమయానికి గురి చేస్తున్న తీరుతెన్నుల మీద చర్చించి భవిష్యత్ కార్యాచరణను టీఆర్ఎస్ఎల్పీ సమావేశం రూపొందించనున్నది.