హైదరాబాద్, అక్టోబ ర్ 7 (నమస్తే తెలంగా ణ): ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా మునుగోడులో ఎగిరేది గులాబీ జెండానేనని ఆర్ అండ్బీశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి స్పష్టంచేశారు. మునుగోడులో తనతోపాటు ప్రచారంలో పాల్గొనే బాలొండ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులతో శుక్రవారం హైదరాబాద్లో మంత్రి సమావేశమయ్యారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి మునుగోడులో విజయం సాధించడానికి అనుసరించాల్సిన వ్యూహాంపై చర్చించారు. ప్రతి గడపకు అందుతున్న కేసీఆర్ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు.