హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): అస్సీ.. బీస్.. ఫార్ములాతో దేశంలో 80 శాతం మంది హిందువులు, 20 శాతం మంది ముస్లింలు ఉన్నారని చెప్పుకొని ఓట్లు అడిగిన బీజేపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రజలకు చేసింది ఏమీ లేదని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు. ఆకాశాన్నంటేలా ధరలు పెంచుతూ పేద, మధ్యతరగతి ప్రజల మీద మోయలేని భారం మోపుతున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ, ధరలను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
కేంద్రం నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ తీర్మానాన్ని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు బలపరిచారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక ధరలకు హద్దు లేకుండా పోయిందని, మోదీ ప్రభుత్వానికి బుద్ధిలేకుండా పోయిందని మండిపడ్డారు.