హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు హిమాన్షుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా విభాగం నేతలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
శుక్రవారం తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలోని లక్షలాది మంది టీఆర్ఎస్ కార్యకర్తలను తీవ్రంగా రెచ్చగొట్టేలా ఉన్నాయని సోషల్ మీడియా కన్వీనర్ దినేష్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అతడి వ్యాఖ్యలతో రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన చింతపండు నవీన్ మీద చర్యలు తీసుకోవాలని కోరారు.