చౌటుప్పల్ : మునుగోడు ఉప ఎన్నికలలో భాగంగా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని తొమ్మిది, పది వార్డులకు చెందిన టీఆర్ఎస్ శ్రేణులు ఇవాళ పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. బీ(టీ)ఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ సందర్భంగా నిర్వహించిన బైక్ ర్యాలీని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం వార్డుల్లో ప్రచారం నిర్వహించారు.
అధికార పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే నియోజకవర్గం మరింత త్వరగా అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అభ్యర్థి నామినేషన్ సందర్భంగా ఎమ్మెల్సీ ఎల్ రమణ, నాయకులు చండూర్ పట్టణంలో ర్యాలీ, ప్రచారాన్ని నిర్వహించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పేదలకు అండగా నిలుస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, అభ్యర్థి ప్రభాకర్ రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు.