హైదరాబాద్ : ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులు బుధవారం సాయంత్రం కలిశారు. టీఆర్ఎస్ అభ్యర్థులుగా నమస్తే తెలంగాణ దినపత్రిక ఎండీ దీవకొండ దామోదర్ రావు, హెటిరో అధిపతి డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి, గాయత్రి గ్రానైట్ సంస్థ అధిపతి వద్దిరాజు రవిచంద్ర(గాయత్రి రవి) పేర్లను కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కేసీఆర్కు వీరు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఈ ముగ్గురికి సీఎం కేసీఆర్ బీ ఫారాలను అందజేశారు.
బండా ప్రకాశ్ ఎమ్మెల్సీగా ఎన్నికవడంతో.. ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ అయింది. ఇక ధర్మపురి శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు పదవీ కాలం ముగియడంతో మరో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో మూడు స్థానాలకు అభ్యర్థుల పేర్లను కేసీఆర్ ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీకి తగినంత సంఖ్యా బలం ఉండటంతో ఈ మూడు రాజ్యసభ సీట్లు అధికార పార్టీకే దక్కనున్నాయి. బండ ప్రకాశ్ రాజీనామాతో అయిన సీటుకు రేపటిలోగా, మిగతా రెండు సీట్లకు ఈ నెల 24లోపు నామినేషన్ వేయాలి.
టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులు దీవకొండ దామోదర్ రావు, బండి పార్థసారథి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర(గాయత్రి రవి)కు ముఖ్యమంత్రి కేసీఆర్ బీ ఫారాలు అందజేశారు. ఈ సందర్భంగా కేసీఆర్కు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. pic.twitter.com/6NAjItFxmv
— Namasthe Telangana (@ntdailyonline) May 18, 2022