హైదరాబాద్: టీఆర్ఎస్ ప్లీనరీ నేపథ్యంలో రాసిన పాట (TRS Plenary Song) సీడీని శనివారం నాడు ఆవిష్కరించారు. పార్టీ నేత కర్నాటి విద్యాసాగర్ ఆధ్వర్యంలో ‘గులాబీ జెండా కేసీఆర్’ అనే పాట ఆడియో సీడీని రూపొందించారు. ఈ సీడీని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కేబినెట్ మంత్రి కె. టి. రామారావు ఆవిష్కరిచారు.
తెలంగాణ భవన్లో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ పాటను ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ ఈ రచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పి. రాములు, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస్ రెడ్డి, కర్నాటి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.