హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగా ణ): షర్మిల బీజేపీ ఏజెంట్ అని టీఆర్ఎస్ పార్టీ నేత ఓరుగంటి వెంకటేశంగౌడ్ ఆరోపించారు. షర్మిల కుటుంబం ఉద్యమ కాలం నుంచి తెలంగాణపై ఉన్న అక్కసును వెళ్లగక్కుతున్నదని ధ్వజమెత్తారు.
గురువారం ఢిల్లీలోని తెలంగాణభవన్ వద్ద జీఎస్ ఆనంద్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి ఏమాత్రం తెలియని షర్మిల ఇష్టమొచ్చినట్టు నోరుపారేసుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. నోరు అదుపులో పెట్టుకోకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.