భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి (Bhupalpally) జిల్లాలో టీఆర్ఎస్ 21వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రాణాలను పణంగాపెట్టి తెలంగాణను సాధించిన కేసీఆర్.. ఇప్పుడు రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపారని చెప్పారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్ అభివృద్ధిలో ముందంజలో నిలిపారని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. 80 వేల ఉద్యోగాలు ఒకేసారి ప్రకటించడం దేశ చరిత్రలో మొదటిసారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు లావణ్య, రాణి భాయ్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.