జగిత్యాల : టీఆర్ఎస్ ఎల్లప్పుడు అండగా ఉంటుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లాలోని ధర్మపురి మండల కేంద్రానికి చెందిన స్తంభంపల్లి హరి ప్రసాద్ గత సంవత్సరం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. హరిప్రసాద్కు టీఆర్ఎస్ సభ్యత్వం ఉండటంతో పార్టీ ద్వారా మంజూరైన రెండు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చెక్కును అతడి తల్లి జమునకు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. చనిపోయిన కార్యకర్త కుటుంబానికి పార్టీ ఇన్సూరెన్స్ చెక్కు కొండంత భరోసా అన్నారు. పార్టీ కార్యకర్త చనిపోతే రెండు లక్షల రూపాయల బీమా అందిస్తున్న ఏకైక పార్టీ దేశంలో టీఆర్ఎస్ ఒక్కటే అన్నారు. ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని పేర్కొన్నారు. మంత్రి వెంట టీఆర్ఎస్ నేతలు, తదితరులు ఉన్నారు.