తిరుమల : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఆమె భర్త అనిల్తో కుటుంబ సభ్యులు శ్రీవారి నిజపాద దర్శనం సేవలో పాల్గొన్నారు. ఈ రోజు ఉదయం స్వామివారికి జరిగిన నిజపాదసేవలో స్వామివారిని దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు ఎమ్మెల్సీ కవిత. శ్రీవారి దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులచే ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు, స్వామి వారి పట్టు వస్త్రాలను కవిత దంపతులకు అందజేశారు. నిన్న కాలినడకన ఎమ్మెల్సీ కవిత దంపతులు తిరుమలకు చేరుకున్నారు.
కుటుంబ సమేతంగా కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని నిజపాదసేవలో దర్శించుకుని,మొక్కులు చెల్లించుకున్నాను.. ఏడు కొండల స్వామివారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుందాం.. pic.twitter.com/v8isRG3NJc
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 18, 2022