హైదరాబాద్ : రాష్ట్రంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్దిదారుల సంఖ్య 10 లక్షలకు చేరింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. సామాజిక మార్పునకు సీఎం కేసీఆర్ దిక్సూచిగా నిలిచారు అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల లబ్దిదారులు 10 లక్షలకు చేరుకోవడం సంతోషంగా ఉందన్నారు.
దేశంలోనే తొలిసారిగా 2014లో ప్రారంభమైన ఈ రెండు పథకాల ద్వారా నిరుపేదల ఆడబిడ్డల వివాహాలకు సీఎం కేసీఆర్ ఆర్థిక సాయం అందిస్తున్నారు అని కవిత గుర్తు చేశారు. ఈ ఆర్థిక సాయంతో తల్లిదండ్రులు అప్పులు చేసి పెండ్లి చేసే స్థితి నుంచి ఆనందంగా పెండ్లి చేసే పరిస్థితి పేద కుటుంబాల్లో ఏర్పడిందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.
దేశంలోనే తొలిసారిగా 2014లో ప్రారంభమైన కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా వివాహానికి సీఎం శ్రీ కేసీఆర్ గారు అందిస్తున్న ఆర్థిక సాయంతో,తల్లిదండ్రులు అప్పులు చేసి పెండ్లి చేసే స్థితి నుండి ఆనందంగా పెండ్లి చేసే పరిస్థితి పేద కుటుంబాల్లో ఏర్పడింది.#మహిళాబంధు#MahilaBandhuKCR https://t.co/u3r0nT5MNY
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 8, 2022