హైదరాబాద్ : టీఎస్పీఎస్సీ సభ్యురాలుగా నూతనంగా ఎంపికైన సుమిత్ర ఆనంద్ తానోబాకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగ నియామకాల్లో పారదర్శకంగా వ్యవహరిస్తూ, ఆదర్శవంత సేవలు అందించాలని సుమిత్ర ఆనంద్ తానోబాకు ఎమ్మెల్సీ కవిత కోరారు. కామారెడ్డి జిల్లాకు చెందిన సుమిత్ర ఆనంద్ కు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.