హైదరాబాద్ : సంక్రాంతి పండుగను సాంప్రదాయం ఉట్టిపడేలా జరుపుకున్నారు ఎమ్మెల్సీ కవిత. హైదరాబాద్ లోని ఎమ్మెల్సీ కవిత తన నివాసంలో ముగ్గులు వేసి రంగులతో అలంకరించారు. దీంతో ఆమె నివాసం ప్రత్యేక శోభన సంతరించుకుంది. ఎమ్మెల్సీ కవిత స్వయంగా ముగ్గులు వేసి, సంక్రాంతి వేడుకల్లో పాలుపంచుకున్నారు. రాష్ట్ర ప్రజలు, రైతాంగం పాడిపంటలు,సిరి సంపదలు, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్న ఎమ్మెల్సీ కవిత ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.