హైదరాబాద్, ఫిబ్రవరి 6(నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యేల ఎర కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును సవాల్ చేయాలని రాష్ట్ర ప్ర భుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చే యనున్నది. సిట్ దర్యాప్తును నిలుపుదల చేసి సీబీఐ దర్యాప్తునకు ఆదేశి స్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకొనేందుకు ద్విసభ్య ధర్మాసనం నిరాకరించింది.
క్రిమినల్ కేసులో అప్పీళ్లపై విచారణ పరిధి హైకోర్టుకు లేదని ద్విసభ్య ధర్మాస నం పేర్కొన్న నేపథ్యంలో సుప్రీం కోర్టును ఆశ్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్రిమినల్ జ్యూరిస్డిక్షన్ లేనికారణంగా అప్పీళ్లను డిస్మిస్ చేస్తున్నట్టు సీజే జస్టిస్ ఉజ్జల్ భూ యాన్, జస్టిస్ తుకారాంజీతో కూడి న ధర్మాసనం సోమవారం తీర్పును వెలువరించింది. వెంటనే ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కల్పించుకొని, తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని, అప్పటివరకు తీర్పు అమలును నిలిపివేయాలని కోరారు.
అందుకు ధ ర్మాసనం నిరాకరిస్తూ అన్ని అంశాలను పరిశీలించాకే తీర్పు చెప్తున్నట్టు స్పష్టంచేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లు బీజేపీలో చేరితే 100 కోట్లు ఇస్తామని, మిగిలిన ఎమ్మెల్యేలకు రూ. 50 కోట్లు ఇస్తామని నిందితులు రా మచంద్రభారతి, నందకుమార్, సింహయాజీ మొయినాబాద్ ఫాం హౌస్లో ప్రలోభ పెట్టారని ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి పోలీసులకు ఫి ర్యాదు చేశారు. ఈ ప్రలోభాల గురిం చి ముందే తెలియడంతో ఆడియో, వీడియో రికార్డులను ఏర్పాటుచేసి పోలీసులు ప్రత్యక్షంగా నిందితులను పట్టుకున్న సంగతి తెలిసిందే.