నిజామాబాద్ : ఆర్మూర్ నియోజకవర్గం శాసనసభ్యుడు ఆశన్నగారి జీవన్ రెడ్డికి కరోనా సోకింది. తేలికపాటి లక్షణాలతో ఇబ్బంది పడుతూ ఉండగా పరీక్షలు నిర్వహించుకుంటే పాజిటివ్ తేలిందని ఎమ్మెల్యే ప్రకటించారు. తనను వారం రోజులుగా కలిసిన వారంతా పరీక్షలు నిర్వహించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రస్తుతం డాక్టర్ల సలహా మేరకు హోమ్ ఐసోలేషన్ లో ఉన్నట్లు జీవన్ రెడ్డి వెల్లడించారు.
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో శనివారం కొత్తగా 1,963 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇద్దరు మృతి చెందారు. మరో 1,620 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 22,017 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. తెలంగాణలో ఇవాళ 53,073 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.