హైదరాబాద్ : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని గిప్ట్ ఏ స్మైల్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి బీరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక అంబులెన్స్ను అందించారు. ఈ అంబులెన్స్ను మంత్రి కేటీఆర్ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ అంబులెన్స్ను కోడేర్ మండలానికి అందిస్తున్నట్లు ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి తెలిపారు.