హైదరాబాద్ : తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. పార్టీ అధ్యక్ష పదవికి ఈసారి కేసీఆరే ఉండాలని ఆయన పేరును ప్రతిపాదిస్తూ మహిళా ప్రజాప్రతినిధులు నామినేషన్ దాఖలు చేశారు. మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, హరిప్రియా నాయక్, రేఖానాయక్, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు తదితరులు నామినేషన్ దాఖలు చేశారు. దీంతో తెలంగాణ భవన్ సందడిగా మారింది.
సంగారెడ్డి, దుబ్బాక, సిరిసిల్ల, కోరుట్ల, వికారాబాద్, పరిగి, సూర్యాపేట, హుజూరునగర్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం అయ్యారు. వచ్చేనెల 15న వరంగల్ లో నిర్వహించే తెలంగాణ విజయ గర్జన బహిరంగ సభపై సన్నాహన సమావేశం నిర్వహించారు.