కరీంనగర్ రూరల్, అక్టోబర్ 31: కరీంనగర్ మండలం చేగుర్తి టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దుర్శేడ్ మార్కెట్ కమిటీ సింగిల్ విండో చైర్మన్ బల్మూరి ఆనందరావు (55) సోమవారం ఉదయం గుండెపోటుతో మృతిచెందారు. మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ సంతాపం తెలిపారు. సోమవారం కరీంనగర్ మండలంలోని చేగుర్తిలోని బల్మూరి అనందరావు అంత్యక్రియలకు హాజరయ్యారు. బల్మూరి పార్థివ దేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. బల్మూరి మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, తెలిపారు.