ఖమ్మం: టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య (Tammineni Krishnaiah) హత్యకేసులో పోలీసులు పురోగతి సాధించారు. కృష్ణయ్యను దారుణంగా హతమార్చిన ఎనిమిది మంది నిందితుల్లో ఆరుగురిని అరెస్టు చేశారు. గురువారం తెల్లవారుజామున వీరిని ఆంధ్రప్రదేశ్లో అదుపులోకి తీసుకుని ఖమ్మంకు తలరిస్తున్నారు. కాగా, ప్రధాన నిందితులైన తమ్మినేని కోటేశ్వరరావు, జక్కంపూడి కృష్ణ అనే నిందితులు ఇంకా పరారీలోనే ఉన్నారు. అరెస్టయినవారిలో ఏ2 రంజాన్, ఏ4 గంజి స్వామి, ఏ5 నూకల లింగయ్య, ఏ6 బోడపట్ల శ్రీను, ఏ7 నాగేశ్వరరావు, ఏ8 ఎల్లంపల్లి నాగయ్య ఉన్నారు. వారివద్ద హత్యకు ఉపయోగించిన కత్తులను స్వాధీనం చేసుకున్నారు.
ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లి గ్రామానికి చెందిన తమ్మినేని కృష్ణయ్య.. సీపీఎం నేత తమ్మినేని వీరభద్రానికి వరుసకి సోదరుడు అవుతారు. ఈ నెల 15న గ్రామ సమీపంలో ఆయన్ను దుండగులు దారుణంగా హతమార్చారు. తమ్మినేని వీరభద్రం సోదరుడైన కోటేశ్వరరావు ప్రమేయంతోనే ఈ హత్య జరిగిందని కృష్ణయ్య కుటుంబీకులు ఆరోపించారు. ఆయన కుమారుడి ఫిర్యాదు మేరకు 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.