ఖమ్మం: స్వాతంత్య్ర దినోత్సవ వేళ ఖమ్మం జిల్లాలో ఘోరం జరిగింది. అధికార టీఆర్ఎస్ పార్టీ నేత దారుణ హత్యకు గురయ్యారు. ఖమ్మం గ్రామీణ మండలం తెల్దారుపల్లి శివారులో పార్టీ నేత కృష్ణయ్యపై ఐదుగురు దుండగులు దాడిచేశారు. వేటకొడవళ్లతో దారుణంగా పొడిచి చంపేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్యజరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. హత్యకు రాజకీయ కక్షలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడైన కృష్ణయ్య.. ఆంధ్రా బ్యాంకు కర్షక సేవ సహకార సంఘం డైరెక్టర్గా ఉన్నారు.