మంత్రి వేముల సంతాపం
డిచ్పల్లి, మే 14: నిజామాబాద్ జిల్లా కేశ్పల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ దివంగత గడ్డం (కేశ్పల్లి) గంగారెడ్డి పెద్ద కుమారుడు గడ్డం ఆనంద్రెడ్డి శుక్రవారం మృతిచెందారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో గుండెపోటుతో కన్నుమూశారు. ఆనంద్రెడ్డి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మొదట 2008 ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తరపున.. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి ఓటమి చెందారు. అనంతరం కొద్ది రోజుల తర్వాత బీజేపీకి రాజీనామా చేసి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరారు. ఆనంద్రెడ్డి మృతిపట్ల మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.